భర్తను వదిలి ప్రియుడితో మూడేళ్లుగా సహజీవనం.. ఆ క్రమంలోనే..

Woman Commits Suicide with Boyfriend Harassment in Piler - Sakshi

పీలేరు రూరల్‌ :  ప్రియుడి వేధింపులతో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వెంకటముని కుమార్తె పొన్ను నిరోషా (28)కు పదేళ్ల క్రితం దేవరకొండ పంచాయతీ మైలవాండ్లపల్లెకు మంజునాథ్‌తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు.

అయితే మూడేళ్ల క్రితం పీలేరు పట్టణం రాఘవేంద్రనగర్‌కు చెందిన యుగంధర్‌ ఆచారితో నిరోషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నిరోషా భర్తతో గొడవ పడి యుగంధర్‌ ఆచారి వద్దకు చేరుకుంది. మూడేళ్లుగా సహజీవనం సాగిస్తోంది.

కొంతకాలంగా యుగంధర్‌ఆచారి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన నిరోషా శుక్రవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన యుగంధర్‌ ఆచారి ఆయన భార్య భవ్య హుటాహుటిన నిరోషాను కిందకు దింపి చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిరోషా తండ్రి వెంకటముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు.    

చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top