పల్నాడు జిల్లా: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య | Three Brutal Assassination In Palnadu District | Sakshi
Sakshi News home page

పల్నాడు జిల్లా: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Nov 23 2023 8:11 AM | Updated on Nov 23 2023 9:04 AM

Three Brutal Assassination In Palnadu District - Sakshi

పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామంలో అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.

సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామంలో అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను తండ్రి సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్‌గా పోలీసులు గుర్తించారు.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా భార్యను భర్త, అత్త, మామ వేధిస్తున్నట్లు సమాచారం. హత్య అనంతరం భార్య మాధురితో సహా బంధువులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement