సెల్ ఫోన్ కోసం .. ప్రాణం తీసుకున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థి

A Student Hangs Himself For Cell Phone At West Godavari - Sakshi

సాక్షి,అనంతపురం(కుందుర్పి): సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన నగేష్‌ కుమారుడు అజిత్‌ (17) ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో కళాశాల తెరవకపోవడంతో పుస్తకాలు పక్కన పెట్టేసి సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయమే సెల్‌ఫోన్‌ తీసుకుని ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తండ్రి మందలించాడు. చదువులపై దృష్టి పెట్టాలంటూ హితవు పలికారు. దీంతో మనస్థాపం చెందిన అజిత్‌.. గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేష్‌ తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top