ఘోర ప్రమాదం: ఆరుగురి దుర్మరణం

Six Deceased In Road Accident At Belagavi Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలోనే ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెళగావి జిల్లా, రామదుర్గం తాలుకా చించనూరు గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ధార్వాడ జిల్లా మోరబ గ్రామంలో కూలీ పనులకు వెళ్లారు.

శుక్రవారం రాత్రి  పనులు ముగించుకొని టాటా ఏస్‌లో వస్తుండగా బెళగావి జిల్లా, సవదత్తి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ధార్వాడ రోడ్డులో బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు టాటా ఏస్‌ నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఐదుగురు మహిళలు, చిన్నారి ఘటనా స్థలంలో మృతి చెందారు. సవదత్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.   (ఘోర ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి)

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top