Six Killed in Road Accident Near Mamallapuram in Tamilnadu - Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Published Thu, May 4 2023 6:27 PM

Road Accident In Tamil Nadu - Sakshi

తమిళనాడు: మామల్లపురం సమీపంలోని గడుంబాడి ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఆటోను ఢీకొనడంతో  డ్రైవర్ సహా ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు మృతి చెందారు. పాండిచ్చేరి వెళ్తున్న ప్రభుత్వ బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వస్తోన్న ఆటోను బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ సహా ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు మరణించారు. ఆటో నుజ్జునుజ్జుగా మారింది. మామల్లపురం పోలీసులు మృతదేహాలను చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: యూపీలో ఎన్‌కౌంటర్‌.. మరో గ్యాంగ్‌స్టర్‌ హతం

Advertisement
Advertisement