యువతిని వేధించి.. కానిస్టేబుల్‌పై దాడిచేసి.. | Man Molestation Young Women In West Godavari District | Sakshi
Sakshi News home page

యువతిని వేధించి.. కానిస్టేబుల్‌పై దాడిచేసి..

Oct 7 2020 11:42 AM | Updated on Oct 7 2020 12:26 PM

Man Molestation Young Women In West Godavari District - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జంగారెడ్డి గూడెంలో రోహిత్‌ అనే యువకుడు హరిప్రియ అనే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతిని కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. దీంతో రోహిత్‌పై జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే రోహిత్‌ పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ నిన్న రాత్రి నుంచి సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. ఈ క్రమంలో సెల్‌టవర్‌పై తేనేటీగలు ఒక్కసారిగా చెలరేగడంతో రోహిత్‌ కేబుల్‌ వైర్లు పట్టుకుని కిందకు దూకేశాడు. తేనేటీగలకు భయపడి స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో గాయపడిన రోహిత్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement