-
యువతిని వేధించి.. కానిస్టేబుల్పై దాడిచేసి..
సాక్షి, పశ్చిమగోదావరి: జంగారెడ్డి గూడెంలో రోహిత్ అనే యువకుడు హరిప్రియ అనే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతిని కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్పై కూడా దాడి చేశాడు. దీంతో రోహిత్పై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే రోహిత్ పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ నిన్న రాత్రి నుంచి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. ఈ క్రమంలో సెల్టవర్పై తేనేటీగలు ఒక్కసారిగా చెలరేగడంతో రోహిత్ కేబుల్ వైర్లు పట్టుకుని కిందకు దూకేశాడు. తేనేటీగలకు భయపడి స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో గాయపడిన రోహిత్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. -
పర్యాటకులపై తేనెటీగల దాడి
పాల్వంచ: పర్యాటకులపై తేనెటీగలు దాడిచేసిన ఘటన కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద శనివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పర్యాటక కేంద్రమైన కిన్నెరసానికి వరంగల్ జిల్లా హన్మకొండలోని బందావనం కాలనీకి చెందిన 44 మంది బస్సులో కిన్నెరసానికి వచ్చారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తూ ప్రాజెక్టు బ్రిడ్జి మీద నుంచి తిరిగి వస్తుండగా బ్రిడ్జికింద ఉన్న తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడిచేసింది. పర్యాటకులు వాటి బారి నుంచి రక్షించుకునేందుకు పరుగులు తీసినా వదలకుండా కుట్టాయి. ఇందులో పది మంది పరిస్థితి తీవ్రంగా ఉండగా, మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. పర్యాటకులైన టి సాంబయ్య, ఎస్ రాంమూర్తి, పి మల్లయ్య, జి కవిత, ఎన్ రామకష్ణ, ఎన్ లక్ష్మీ, ఎన్ సహస్ర, చక్రధర్ స్వామి, సాంబలక్ష్మి, రామలక్ష్మిలను తీవ్రంగా కుట్టాయి. డాక్టర్ రమాదేవి, శ్రీనివాసరెడ్డి, తేజస్వీ, అనిల్ కుమార్, శ్రీనివాసరెడ్డి, రోహిత్, రమ, గడ్డం కవిత, తదితరులపై దాడిచేశాయి. బాధితులను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement