
కాకినాడ: జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సామర్లకోట మండలం పి. వేమవరంలో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితులు పోలీసులకు లొంగిపోయారు. విషయంలోకి వెళ్తే.. కిరణ్ కార్తీక్ అనే యువకుడు.. ఓ యువతిని ప్రేమించాడు.
ఇది తెలుసుకున్న యువతి సోదరుడు మరో స్నేహితుడితో కలిసి కిరణ్ కార్తీక్ను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే 10 రోజుల కిందటే కిరణ్ కార్తీక్ హత్య చేపి శవాన్ని పాతిపెట్టాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులు కృష్ణప్రసాద్, వినోద్లు పోలీసులకు లొంగిపోయారు.