-
మద్యం మత్తులో తండ్రిని చితకబాదిన కొడుకు
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం ఉండూరులో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన కొడుకు తన తండ్రిని చితకబాదాడు. దాంతో తండ్రి చిట్టిపల్లి అబ్బాయికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘సిరిరేఖల’పై పెను నిర్లక్ష్యం
అమలాపురం, న్యూస్లైన్ : గోదావరి డెల్టా ఆధునికీకరణను అటు సర్కారూ చిన్నచూపు చూస్తుండగా ఇటు కాలమూ కలిసిరావడం లేదు. అస్తవ్యస్తంగా మారిన పంట కాలువలను ఆధునికీకరించేందుకు దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.1,130 కోట్లు మంజూరు చేశారు. పనులను తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి 2007లో టెండర్లు పిలిచారు. తొలుత తూర్పుడెల్టాలో కాకినాడ, మండపేట, కోటిపల్లి బ్యాంకు కెనాల్, సామర్లకోట, మధ్యడెల్టాలో పి.గన్నవరం ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. తరువాత రెండేళ్ల వరకు టెండర్లు పడకపోవడంతో మిగిలిన నాలుగు ప్యాకేజీలను 16 చిన్నప్యాకేజీలు చేసి టెండర్లు పిలిచారు. మధ్యడెల్టా పరిధిలోని ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ పరిధిలో అన్నంపల్లి నుంచి పల్లంకుర్రు వరకు రూ.72 కోట్ల విలువ చేసే రెండు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. ఆధునికీకరణ పనులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2012 జూన్ నాటికి పూర్తి కావలసి ఉంది. గడువు ముగిసి ఏడాది దాటినా 33 శాతం పనులు కూడా పూర్తికాలేదు. పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం పెరుగుతోంది. అయితే ప్రభుత్వం దానికి తగ్గట్టు నిధులు పెంచకపోగా ఉన్న పనులను(లాకులు, వంతెనల పనులు) కుదించడంతో ఆధునికీకరణ లక్ష్యమే వరద గోదాట్లో ఇసుకతిన్నెలా మరుగున పడుతోంది. సకాలంలో నీరందక, వరదల్లో నీరు చేలను ముంచెత్తి రైతులు ఏటా రూ.వందల కోట్ల నష్టాలను మూటగట్టుకోవలసి వస్తోంది. ఈ ఏడాది రూ.75 కోట్లే టెండర్లు ఖరారైన ప్యాకేజీల్లో సుమారు రూ.600 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా ఇంత వరకు రూ.250 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇంకా రూ.350 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.75 కోట్లకు మాత్రమే పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఆధునికీకరణ పనులు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తయిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. సొమ్ములు మిగిలే మట్టి పనులు మాత్రమే చేసి నిర్మాణ పనులకు దూరంగా ఉండడం కూడా పనులు ఆలస్యం కావడానికి కారణమవుతోంది. డెల్టా ఆధునికీకరణకు కాలమూ ప్రతికూలంగా మారింది. ఏటా ఖరీఫ్ పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోవడంతో రబీలో పంట కాలువలకు లాంగ్ క్లోజర్ ప్రకటించే అవకాశం లేకుండా పోతోంది. రెండేళ్ల క్రితం గోదావరిలో నీటికి ఎద్దడి నెలకొన్న సమయంలో మాత్రమే మండపేట, కాకినాడ కాలువలను మూసివేసి పనులు చేయగలిగారు. మిగిలిన చోట్ల ఆ పరిస్థితి లేకపోయింది. ఈ ఏడాది పంటకాలువల మూసివేత సమయంలో రూ.75 కోట్లతో ఆధునికీకరణ పనులు చేయాలని ఇటీవల కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అధికారులు తేల్చారు. మార్చి నెలాఖరు నుంచి జూన్ 15 వరకు కాలువలు మూసివేసి 75 రోజుల్లో ఆధునికీకరణ పనులు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది రబీసాగు ఆలస్యం కావడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు డెల్టాకు సాగునీరందించక తప్పదు. దీంతో క్లోజర్ సమయం 45 రోజులకే పరిమితం కానుంది. ఈ కారణంగా ఈసారీ పెద్దగా పనులు జరిగే ఆశ లేకుండా పోయింది.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- బాపట్ల బీచ్లో హైదరాబాదీల గల్లంతు
- ఎలాన్ మస్క్కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్.. ఇండియాకు రావాలంటూ ట్వీట్
- India vs China: టగ్ ఆఫ్ వార్లో భారత బలగాల గెలుపు
- నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
Advertisement