Hyderabad Crime: Man Kills Wife With Suspicion At LB Nagar - Sakshi
Sakshi News home page

LB Nagar Crime: మైనర్‌పై లైంగిక దాడి, జైలుకెళ్లి వచ్చాక పెళ్లి.. భార్యపై అనుమానంతో

Sep 2 2022 1:33 PM | Updated on Sep 2 2022 3:07 PM

Man Kills Wife With Suspicion At LB Nagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం..

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి చేయడంతో త్రీవంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నందనవనంలో ఉండే సబా ఫాతీమా(22) మైనర్‌గా ఉన్నపుడు బైరామల్‌గూడలోని అల్లాఫ్‌ నగర్‌లో ఉంటూ కూలీ పని చేసే పాతనేరస్తుడు దాసరి సురేందర్‌ (30) ఆమెపై అత్యాచారం చేశాడు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు అతడిపై ఫోక్సో తదితర కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత బాధితురాలినే సురేందర్‌ కులాంతర వివాహం చేసుకున్నాడు. సురేందర్‌ తల్లి యాదమ్మ, భార్య సబా ఫాతీమాతో కలిసి అల్లాఫ్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరికి 9 నెలల పాప ఉంది. 2021 డిసెంబర్‌లో బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనం కేసులో మళ్లీ అరెస్టయి జైలుకు వెళ్లాడు.  జైలు నుంచి వచ్చినప్పటి నుంచీ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. కూతురు పుట్టడంతో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కొట్టేవాడు. ఇదే క్రమంలో బుధవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.

సురేందర్‌ భార్యపై చేయి చేసుకోవడం కింద పడి తీవ్ర రక్తస్రావమైంది. ఫాతీమా మెట్లపై నుంచి కిందపడి గాయపడిందని ఆమె తల్లిదండ్రులకు సురేందర్‌ సమాచారం ఇచ్చాడు. స్థానికులు వెంటనే ఫాతీమాను చికిత్స నిమిత్తం వనస్ధలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు  అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. మృతురాలి తల్లి షబానా బేగం తన కుతురును అల్లుడు సురేందర్, ఆమె తల్లి యాదమ్మ కలిసి హత్య చేశారని ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 
చదవండి: నీ కుమారుడి కంటే దారణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement