గుంటూరు బ్యూటీషియన్‌ హత్యకేసు.. వివాహేతర సంబంధమే కారణమా? | Man Arrested Beautician Murder Case in Tenali, Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరు బ్యూటీషియన్‌ హత్యకేసు.. పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధమే కారణమా?

Nov 19 2022 7:01 PM | Updated on Nov 19 2022 7:04 PM

Man Arrested Beautician Murder Case in Tenali, Guntur - Sakshi

నిందితుడు వెంకటకోటయ్య, స్వాతి (ఫైల్‌)

సాక్షి, గుంటూరు(తెనాలిరూరల్‌): బ్యూటీషియన్‌ హత్య కేసులో ఆమె భర్తను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. గురువారం స్థానిక గాంధీనగర్‌ ఘంటావారి వీధిలోని బ్యూటీ పార్లర్‌లో ఉన్న స్వాతిని ఆమె భర్త వెంకట కోటయ్య కత్తితో దారుణంగా నరికి చంపి, ఆపై ఆమె శవంపై పూల మాలలు వేసి నివాళులర్పించి మరీ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.

స్థానిక టూటౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ స్రవంతి రాయ్‌ వెల్లడించారు. అనుమానంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు డీఎస్పీ వివరించారు. ఆమె కథనం ప్రకారం.. చెంచుపేట జెండాచెట్టు బజారుకు చెందిన లారీ డ్రైవర్‌ పరిమి వెంకటేశ్వరరావు కుమార్తె స్వాతికి లారీ డ్రైవర్‌ కాకర్ల వెంకట కోటయ్యతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వాతి గాంధీనగర్‌లో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది.

చదవండి: (ఫేస్‌బుక్‌లో పరిచయైన యువతితో పెళ్లికి సిద్ధం.. రూ.39లక్షలు..!)

ఆమె ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వెంకట కోటయ్య అనుమానించేవాడు. ఈ విషయంపై తరచూ ఆమెతో  ఘర్షణ పడేవాడు. ఈ నెల 15వ తేదీన కూడా భార్యతో గొడవ పడి కొట్టడంతో ఆమె చెంచుపేటలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రోజూ తల్లిదండ్రుల ఇంటి వద్ద నుండే గాంధీనగర్‌లోని బ్యూటీ పార్లర్‌కు వచ్చి వెళుతోంది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న వెంకట కోటయ్య గురువారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్‌ వద్దకు వచ్చి స్వాతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది.

భార్య మృతి చెందిందని నిర్ధారించుకున్న వెంకట కోటయ్య ముందుగానే తన వెంట తెచ్చుకున్న పూల దండలను ఆమె మృతదేహంపై వేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి ఇద్దరు కొడుకులకు తల్లిని చంపేసినట్లు చెప్పాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో టూటౌన్‌ సీఐ ఎస్‌.వెంకట్రావు, ఎస్‌ఐ శివరామయ్య, సిబ్బంది ఉన్నారు. 

చదవండి: (గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్‌లో భార్యను చంపిన భర్త)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement