సాక్షి, యాదాద్రి: హైదరాబాద్-యాదగిరిగుట్ట టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపుతోంది. బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేటు వద్ద బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వ స్తుండగా.. టోల్ గేట్ ఫాస్టాగ్ లేన్-2లో రెనో కారు (TS10EE3224)లో ఉన్నట్లుండి ఆకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి.
(చదవండి: టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు)
ఇది గమనించి వెంటనే కారులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగారు. టోల్ గేట్ సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగినట్లు తెలిసింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.