ఫ్లాట్ తలుపులు తెరిచే ఉన్నాయి.. లోనికి వెళ్లి చూడగా..

Hyderabad: Man Ends His Life Over Father Deceased - Sakshi

సాక్షి,(కుత్బుల్లాపూర్‌)హైదరాబాద్: తండ్రి మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండమూడి ఎన్‌క్లేవ్‌ రోడ్డులో ఉండే ఎన్‌సీఎల్‌ సింధులో నివాసముండే పినకపాణి(56) తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కాగా నాలుగు రోజుల క్రితం తండ్రి కృష్ణమూర్తి మృతి చెందాడు.

అతడి తల్లి జీడిమెట్ల పైపులైన్‌ రోడ్డులో ఉండే పెద్దకుమారుడు వెంకటరమణ ఇంటికి వెళ్లడంతో పినకపాణి ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తండ్రి పెద్దకర్మ విషయమై మాట్లాడేందుకు ఎన్‌సీఎల్‌ సింధు–సీ బ్లాక్‌లో నివాసముండే అక్క రమాదేవి, బావ సీవీ కుమార్‌లు మొబైల్‌ ద్వారా మెసేజ్‌ పెట్టగా సమాధానం ఇవ్వలేదు. దీంతో వారు పినకపాణి ఉంటున్న ఫ్లాట్‌కు రాగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ‘నేను వెళ్లిపోతున్నా..తమ్ముడిని బాగా చూసుకోండి’

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top