‘నేను వెళ్లిపోతున్నా..తమ్ముడిని బాగా చూసుకోండి’
తండ్రికి మెసేజ్ పెట్టి విద్యార్థి అదృశ్యం
సాక్షి,హయత్నగర్(హైదరాబాద్): ‘నేను వెళ్లిపోతున్నా..తమ్ముడిని బాగా చూసుకోండి’ ..అంటూ ఓ విద్యార్థి తన తండ్రి ఫోన్కు మెసేజ్ పెట్టి కనిపించకుండాపోయాడు. హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ నివాసి మహ్మద్ ఖాజా కుమారుడు రహమాన్ (17) హయత్నగర్ మదర్ డెయిరీ సమీపంలోని ఎక్సెల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
సోమవారం ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన రహమాన్ మధ్యాహ్నం 12 గంటలకు కళాశాల నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన తండ్రికి మెసేజ్ పెట్టి కనిపించకుండాపోయాడు. తండ్రి నుంచి ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు రహమాన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.