Hyderabad: అనుమానాస్పదంగా యువకుడి ఆత్మహత్య.. చిన్న చిన్న తప్పులు చేశానంటూ..

HYD: Engineering Student Commitsn Suicide at Maisammaguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీవితం మీద విరక్తి చెంది ఓ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్‌ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు హర్షిత్‌(20) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మైసమ్మగూడలోని శ్రీకాంత్‌రెడ్డి హాస్టల్‌లో ఉంటూ ప్రతి రోజు కాలేజీకి వెళ్లి వస్తుండేవాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్టల్‌ గదికి చేరుకున్న హర్షిత్‌ సాయంత్రం 4 గంటల సమయంలో తోటి స్నేహితులు వచ్చే సరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న వారు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా.. ‘చిన్న చిన్న తప్పులు చేశాను.. స్నేహితుల వద్ద అప్పులు కూడా తీసుకున్నాను.. చదువులో సైతం పూర్‌గా ఉన్నాను.. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ సెల్ఫీ వీడియో ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వగా తండ్రి నారాయణరావు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఫోన్‌ ఓపెన్‌ అయితే తెలుస్తుందన్న తండ్రి అనుమానం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top