గనుల శాఖ మహిళా అధికారి హత్య | Female Deputy Director Of Karnataka Geology Department Found Murdered In Bengaluru - Sakshi
Sakshi News home page

గనుల శాఖ మహిళా అధికారి హత్య

Nov 6 2023 6:13 AM | Updated on Nov 6 2023 10:31 AM

Female deputy director of Karnataka geology department found murdered - Sakshi

బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్‌ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు.

కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్‌ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని        తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు.

Advertisement
 
Advertisement
Advertisement