విషాదం: చెరువులో శవమై తేలిన సుమేధ | 12 Year Girl Missing: Dead Body Found At Banda Cheruvu In Hyderabad | Sakshi
Sakshi News home page

విషాదం: చెరువులో శవమై తేలిన సుమేధ

Sep 18 2020 12:50 PM | Updated on Sep 17 2021 5:59 PM

12 Year Girl Missing: Dead Body Found At Banda Cheruvu In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సుమేధ గురువారం సాయంత్రం సైకిల్‌ తొక్కుతూ బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాక్షి, మేడ్చల్‌: నేరెడ్‌మెట్‌లో అదృశ్యమైన సుమేధ కపూరియా (12) కేసు విషాదంతమైంది. బాలిక మృత దేహం శుక్రవారం మధ్యాహ్నం బండచెరువులో లభ్యమైంది. కాగా, నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్ కాలనీలో నివాసముండే సుమేధ గురువారం సాయంత్రం సైకిల్‌ తొక్కుతూ బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయి ఉండొచ్చనే అనుమానంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేయించగా.. బండ చెరువులో బాలిక విగత జీవిగా కనిపించింది.




(చదవండి: ఇంటి నుంచి బయటికెళ్లిన బాలిక అదృశ్యం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement