రమ్యశ్రీ ఆరోగ్య విషయం తెలుసుకున్న బైరెడ్డిపల్లె మండలం కరసనపల్లికి చెందిన రెడ్డివారి లీలావతమ్మ రామకృష్ణారెడ్డి, ఉమాదేవి రెడ్డెప్పరెడ్డి, రెడ్డివారి జయశంకర్ రెడ్డి, విజయ శంకర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, నాగశంకర్ రెడ్డి (వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి) కుటుంబం రమ్యశ్రీ వైద్య చికిత్స కోసం ఆదివారం రూ.70 వేల ఆర్థిక సహాయం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రా ణాపాయ స్థితిలో ఉన్న రమ్యశ్రీని ఆదుకునేందు కు సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు. ఇలాంటి విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం సామాజిక బాధ్యతని పేర్కొన్నారు.


