అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

Apr 21 2025 12:23 AM | Updated on Apr 21 2025 12:23 AM

అగ్ని

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

– రూ.3 లక్షల ఆస్తి నష్టం

పుత్తూరు : మండల పరిధిలోని కృష్ణసముద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సుకన్య పెంకుటింటిలో నివాసం ఉంటోంది. ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో ఇల్లు పూర్తిగా మంటలు వ్యాపించాయి. పుత్తూరు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో రూ.3 లక్షలు విలువైన వస్తువులు, ఇంటి సామగ్రి, 4 సవర్ల బంగారు నగలు పూర్తిగా దగ్ధమయ్యా యి. సుకన్య తన ఇద్దరు పిల్లలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుకన్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నాటు బాంబు పేలి

యువతికి గాయాలు

గంగాధర నెల్లూరు : నాటుబాంబు పేలి యువతికి గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీ ఆవల కొండ గ్రామానికి చెందిన కమ్రతాజ్‌ శనివారం తన పొలంలో కొబ్బరి కాయలు కోస్తుండగా అడవి జంతువుల వేట కోసం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నాటు బాంబుపేలి చేయి, కాలికి గాయాలయ్యాయి. వెంటనే జీడీ నెల్లూరులో ఒక ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నట్లు కుటుంబికులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పంట పొలాల్లో నాటు బాంబులు పెడుతున్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం 1
1/1

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement