
చెరువులో పడి అవ్వామనవడి మృతి
గుడుపల్లె: పశువులను కడిగేందుకు చెరువులోకి వెళ్లి అవ్వామనవడు మృతి చెందిన సంఘటన గుడుపల్లె మండలం బిజిగానిపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని బిజిగానిపల్లె గ్రామానికి చెందిన మునెమ్మ(65) ఆమె మనుమడు జయప్రదీప్(14) గ్రామానికి సమీపంలోని నాగరప్ప చెరువులోకి తమ పశువులను కడగడానికి తీసుకు వెళ్లారు. పశువులను చెరువులో కడుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు లోతుగా ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందారు. స్థానికులు గమనించి వెంటనే చెరువులోకి వెళ్లి చూడగా వారి మృతి చెందారు. జయ ప్రదీప్ 9వ తరగతి చదువుతున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉండి చెరువులో పడి మృతి చెందడంతో కుటుంబంలో విషాదచాయలు కమ్ముకున్నాయి.
లారీని ఢీకొన్న ఐషర్ వాహనం
శ్రీరంగరాజపురం : ఆగి ఉన్న లారీని ఐషర్ వాహనం ఢీకొన్న సంఘటన మండలంలోని పెద్దతయ్యూరు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి పళ్లిపట్టు నుంచి చి త్తూరు వైపు వెళుతున్న ఐషర్ వా హనం మండలంలోని పెద్దతయ్యూరు వద్ద చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఐషర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఐషర్ వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జ రగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు.

చెరువులో పడి అవ్వామనవడి మృతి