యమహా నుంచి రెండు కొత్త ప్రీమియం బైకులు | Yamaha Launches Two Premium Bikes and New Electric Scooters in India | Sakshi
Sakshi News home page

యమహా నుంచి రెండు కొత్త ప్రీమియం బైకులు

Nov 12 2025 9:40 PM | Updated on Nov 12 2025 9:40 PM

Yamaha Launches Two Premium Bikes and New Electric Scooters in India

జపాన్‌ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా మోటార్‌ ఇండియా కొత్త బైకులు, ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేసింది. వీటిలో ఎక్స్‌ఎస్‌ఆర్‌155, ఎఫ్‌జెడ్‌ రేవ్‌ ప్రీమియం బైకులతో పాటు ఏరోక్స్‌–ఈ, ఈసీ–06 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉన్నాయి. రెట్రో లుకింగ్‌ ఉండే ఎక్స్‌ఎస్‌ఆర్‌155 బైక్‌ ప్రారంభ ధర రూ.1,49,990గా ఉంది. స్టైలిష్‌ అప్‌డేట్‌ తో యమహా ఎఫ్‌జెడ్‌ రేవ్‌: ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద దీని ధర రూ.1,17,218గా ఉంది. ఇది యమహా ప్రముఖ ఎఫ్‌జెడ్‌ మోడల్‌కు తాజా అప్‌డేట్‌.  

యమహా ఎక్స్‌ఎస్‌ఆర్‌155

  • స్టైల్: రెట్రో లుకింగ్‌ (క్లాసిక్‌ + మోడ్రన్‌ కలయిక)

  • ఇంజిన్: 155సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ (వీవీఏ టెక్నాలజీతో)

  • ధర: రూ.1,49,990 (ఎక్స్‌–షోరూమ్‌)

  • ఫీచర్లు: ఎల్‌ఈడీ లైటింగ్‌, డిజిటల్‌ క్లస్టర్‌, సాఫ్ట్‌ సీట్‌, హై క్వాలిటీ ఫినిష్‌

యమహా ఎఫ్‌జెడ్‌ రేవ్‌

  • ధర: రూ.1,17,218 (ఢిల్లీ ఎక్స్‌–షోరూమ్‌)

  • ఫీచర్లు: స్టైలిష్‌ డిజైన్‌, మస్క్యులర్‌ ట్యాంక్‌, అప్‌డేట్‌డ్‌ ఎలక్ట్రానిక్స్‌, బెటర్‌ రైడింగ్‌ ఎర్గోనామిక్స్‌

  • ఇది యమహా ఎఫ్‌జెడ్‌ సిరీస్‌లో తాజా వెర్షన్‌, మరింత రిఫైన్‌ చేసిన ఇంజిన్‌, మైలేజ్‌ అందిస్తుంది.

కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు యమహా ఏరోక్స్‌–ఈ, ఈసీ–06 స్పెసిఫికేషన్లు ఇంకా పూర్తిగా ప్రకటించకపోయినా, ఈ రెండూ అర్బన్‌ రైడింగ్‌ కోసం హై–పర్ఫార్మెన్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లుగా రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement