Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

Today Stock Market Update - Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు ఇంటస్ట్ర్‌ చూపిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లు సరికొత్త రికార్డ్‌ లను కొనసాగిస్తున్నాయి. ఆ రికార్డ్‌ల పరంపర కొనసాగిస్తూ గురువారం ఉదయం మార్కెట్లు 9.38 గంటల సమాయానికి నిఫ్టీ 54.05 పాయింట్ల లాభంతో 17,125.10 వద్ద ట్రేడ్‌ అవుతుండగా సెన్సెక్స్‌  144.77 పాయింట్ల లాభంతో 57,482.98 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.    

కాగా, మారుతి సుజికి,డీఆర్‌ఎల్‌,బజాజ్‌ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ మార్కెట్లు లాభాల్ని గడిస్తుండగా.. వోల్టాస్‌,బాటా ఇండియా, గోద్రెజ్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top