
జులై ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు అస్సలు తగ్గడం లేదు. ఈ రోజు కూడా గరిష్టంగా రూ.710 పెరిగి పసిడి ప్రియులకు మళ్ళీ షాకిచ్చింది. దీంతో ఈ రోజు (జులై 6) ధరలు మళ్ళీ పెరిగాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67650 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73800 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగినట్లు స్పష్టమవుతోంది.
ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం భారీగానే పెరిగాయి. నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67800 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73950 వద్ద ఉంది. అంటే ఈ రోజు ధరలు రూ. 650, రూ. 710 పెరిగాయి.
చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు రూ. 600 (22 క్యారెట్స్, 10 గ్రామ్స్), రూ. 650 (24 క్యారెట్స్, 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68200.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74400 వద్ద ఉంది.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ రోజు (జులై 6) వెండి ధర ఏకంగా రూ. 1600 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 94800 వద్ద ఉంది. జులై ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వెండి ఏకంగా రూ. 4800 పెరిగింది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుతుందని స్పష్టమవుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).