న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల క్రూడాయిల్ రేట్లు ర్యాలీ చేస్తుండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడటంలాంటి ప్రతికూల అంశాలతో పసిడి ధరలు మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 800 మేర క్షీణించి రూ. 1,45,500కి తగ్గింది. బంగారం చివరిసారిగా జూన్ 25న రూ. 1,45,300 వద్ద ట్రేడయ్యింది. అటు వెండి ధర కేజీకి రూ. 2,000 క్షీణించి రూ. 2,22,500కి పడిపోయింది. ఈ వారంలో పసిడి ధర 3,000, వెండి రూ. 14,500 మేర క్షీణించాయి.


