
యూనియన్ బడ్జెట్ 2024-25 తరువాత ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్ళీ ఊపందుకున్నాయి. జులై 27 నుంచి ఇప్పటి వరకు (జులై 29) గరిష్టంగా తులం గోల్డ్ రేటు రూ. 430 పెరిగింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం..
విజయవాడ, హైదరాబాద్లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63400 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 69160 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.150, రూ.160 పెరిగింది.
ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 160 పెరిగింది. దీంతో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63550 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69310 వద్ద ఉంది.
హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో బంగారం ధరలు పెరుగుదల దిశగా నడుస్తుంటే.. చెన్నైలో మాత్రమే గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 550 తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 64130 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 69980 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 500, రూ. 550 పెరిగినట్లు స్పష్టమవుతోంది.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర మునుపటికంటే రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి కొనుగోలు చేయాలంటే రూ. 85,000 వెచ్చించాల్సి ఉంటుంది. మూడు రోజులు తర్వాత మళ్ళీ వెండి ధర పెరిగింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).