Tata Motors Ace Electric Cargo Vehicle Launched In India, Bags Order For 39,000 Units - Sakshi
Sakshi News home page

Tata Ace EV Launch: టాటా ఎలక్ట్రిక్‌ వెహికల్‌,లాంచ్‌ చేసిందో లేదో.. హాట్‌ కేకుల్లా బుకింగ్స్‌

May 6 2022 7:28 AM | Updated on May 6 2022 8:52 AM

Tata Motors launches Ace EV cargo vehicle - Sakshi

టాటా ఎలక్ట్రిక్‌ వెహికల్‌,లాంచ్‌ చేసిందో లేదో..హాట్‌ కేకుల్లా బుకింగ్స్‌ అవుతున్నాయ్‌!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా ఏస్‌ మినీ ట్రక్‌ను ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో ప్రవేశపెట్టింది. ఈవోజెన్‌ పవర్‌ట్రైన్‌తో 27 కిలోవాట్‌ (36 హెచ్‌పీ) మోటార్‌ను పొందుపరిచింది. 

ఒకసారి చార్జింగ్‌ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39,000 యూనిట్ల ఏస్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్‌ దక్కించుకుంది. 

అమెజాన్, బిగ్‌బాస్కెట్, సిటీ లింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్‌ ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ కంపెనీలకు ఏస్‌ ఎలక్ట్రిక్‌ను సరఫరా చేయనుంది. కాగా, ఏస్‌ మినీ ట్రక్‌ను కంపెనీ 2005లో భారత్‌లో పరిచయం చేసింది. 20 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది.

చదవండి👉తగ్గేదేలే..! ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో టాటా మోటార్స్‌ దూకుడు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement