సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Mar 11 2024 3:11 PM | Updated on Mar 11 2024 3:33 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 175 పాయింట్లు నష్టపోయి 22,332 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 616 పాయింట్లు దిగజారి 73,502 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా స్టాక్‌ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 81.60 డాలర్ల వద్దకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం నికరంగా రూ.7,304.11 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,601.81 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement