రుణ సంక్షోభంతో సతమతమవుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కొత్త బ్రాండ్ ప్రచారానికి బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ను తీసుకుంది. ‘వీఐ మారుతోంది.. సిద్ధంగా ఉండండి’ అనే పేరుతో త్వరలో ప్రారంభించనున్న ప్రచారానికి ఆయన ప్రాతినిధ్యం వ్యవహరించనున్నట్లు కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్త బ్రాండ్ రూపంలో భాగంగా వీఐ తన లోగోలోనూ మార్పులు చేసింది. ఇంతకుముందు ‘ఐ’ కింద ఉన్న పసుపు చుక్కను ఇప్పుడు పైకి మార్చి, గోళాకారంలో తీర్చిదిద్దింది. ‘‘ఇది కేవలం లోగోలో మార్పు మాత్రమే కాదు. వీఐ బ్రాండ్లో తీసుకొస్తున్న పరిణామానికి ఇది తొలి సంకేతం. టెలికం సేవల ద్వారా వినియోగదారుల జీవితాలను మరింత ఆహ్లాదకరంగా, అవకాశాలతో నింపాలన్న మా ఆశయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది’’ అని వీఐ సీఈవో అభిజిత్ కిశోర్ తెలిపారు.
ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ!


