రాజు పి.పుత్రన్ దూరదృష్టి కలిగిన సామాజిక పారిశ్రామికవేత్త, మానవతావాది, దాత, సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో జన్మించిన ఆయన, ఆతిథ్య రంగంలో తీవ్రమైన ఆర్థిక కష్టాలను అధిగమించి.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో సమాజాభివృద్ధికి మార్గదర్శకుడిగా ఎదిగారు. ఆయన మరణానంతరం కూడా, గ్రామీణ విద్య, ఆరోగ్య సేవలు, సామాజిక సంక్షేమ రంగాలలో ఆయన ప్రారంభించిన సేవలు స్వావలంబన.. సామాజిక మార్పుకు చిరస్థాయిగా స్ఫూర్తినిస్తున్నాయి.
ఇది దివంగత రాజు పి. పుత్రన్ను స్మరించుకునే ప్రత్యేకమైన రోజు. జీవిత ప్రారంభంలో ఎన్నో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఆయన, ఆ కష్టాలను ఇతరులకు సేవ చేయాలనే జీవితకాల సంకల్పంగా మార్చుకున్నారు. ఉడుపిలో జన్మించిన ఆయన, పేదరికం కారణంగా తన సాధారణ విద్యను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఆ పరిస్థితులు ఆయనను నిరుత్సాహపరచలేదు. బదులుగా.. పేద, వెనుకబడిన పిల్లలు ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరం కాకూడదనే దృఢ సంకల్పాన్ని ఆయనలో పెంపొందించాయి.

అలుపెరగని ఆయన సేవా తపన ఫలితంగా.. 2012లో సరస్వతి ఫౌండేషన్ను స్థాపించారు. గత దశాబ్దకాలంగా ఈ సంస్థ విద్యా వేతనాలు, విద్యాసంస్థల్లో రాయితీ అవకాశాలు, వైద్య సహాయం మరియు స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాల ద్వారా అనేక మంది జీవితాలను మార్చి సమాజంలో విశేషమైన మార్పును తీసుకొచ్చింది.
ఈ ప్రత్యేకమైన రోజున ఆయన చిరస్మరణీయ సేవలకు మా ఘన నివాళిని అర్పిస్తూ.. అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కలలను కొనసాగించాలని కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.
మీరు మమ్మల్ని విడిచి వెళ్లి ఒక సంవత్సరం గడిచింది. అయినప్పటికీ.. మీ ప్రేమ, మీ జ్ఞాపకాలు, మీ మార్గదర్శకత్వం మా ప్రతి రోజులోనూ సజీవంగా ఉన్నాయి. మీ జ్ఞానం మాకు దారి చూపుతోంది. మీ దయ మాకు బలాన్నిస్తోంది. మీ ప్రేమ మా కుటుంబాన్ని ఎప్పటికీ ఒక్కటిగా ఉంచుతోంది. నిజాయితీ, ధైర్యం మరియు నిస్వార్థ ప్రేమ అనే అమూల్యమైన వారసత్వాన్ని మీరు మాకు అందించారు. మీ చిరునవ్వు, మీ ఆప్యాయమైన సలహాలు, మా ఇంటికి మీరు తీసుకొచ్చిన ఆప్యాయత.. అన్నీ ప్రతి రోజూ మాకు ఎంతో గుర్తుకొస్తున్నాయి. మీరు మా హృదయాలలో శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు అని కుటుంబ సభ్యుల నివాళులు అర్పించారు.


