35 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ అమ్మేసిందా? | RBI Denies Social Media Rumours Of Selling 35 Tonnes Of Gold, PIB Fact Check Confirms Claims Are Fake | Sakshi
Sakshi News home page

35 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ అమ్మేసిందా?

Nov 8 2025 4:59 PM | Updated on Nov 8 2025 5:59 PM

RBI Dismisses Reports Of Selling 35 Tonnes Of Gold

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన పసిడి నిల్వలలో నుంచి 35 టన్నుల బంగారాన్ని అమ్మేసినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్మీడియాలో కథనాలు విస్తృతంగా వచ్చాయి. కథనాలను దేశ అత్యున్నత బ్యాంక్ఖండించింది. వార్తలపై ఫ్యాక్ట్చెక్నిర్వహించిన ప్రభుత్వ వార్తా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అవన్నీ ఫేక్అని తేలుస్తూఎక్స్‌’లో పోస్ట్చేయగా దాన్ని ఆర్బీఐ రీ ట్వీట్చేస్తూ సెంట్రల్ బ్యాంక్ అటువంటి అమ్మకం జరగలేదని స్పష్టం చేసింది.

ఆర్బీఐకి సంబంధించి సోషల్మీడియాలో వస్తున్న అవాస్తవ సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితమైన వివరాలు, అప్డేట్ కోసం తమ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచిస్తూ ఆర్బీఐ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.

ప్రపంచంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేపథ్యంలో అనేక ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా యూఎస్ డాలర్ నుండి వైవిధ్యపరచడానికి తమ పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. 2022లో రష్యా రిజర్వ్ ఆస్తులను స్తంభింపజేసిన తర్వాత ఈ ధోరణి ఊపందుకుంది.

భారతీయ రిజర్వ్బ్యాంకు వద్ద ప్రస్తుతం (2025 సెప్టెంబర్చివరి నాటికి) 880.8 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటి అంచనా విలువ దాదాపు 9 లక్షల కోట్లకు పైనే. వీటిలో 575.8 టన్నులు భారత్లో ఉండగా 290.3 టన్నులు విదేశాల్లో బ్యాంక్ఆఫ్ఇంగ్లండ్‌, బ్యాంక్ఫర్ఇంటర్నేషనల్సెటిల్మెంట్స్వంటి వాటి వద్ద ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement