ఆర్‌బీఐ జోక్యంతో కోలుకున్న రూపాయి!  | Rupee rises 12 paise to close at 90.26 against U.S. dollar | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ జోక్యంతో కోలుకున్న రూపాయి! 

Dec 19 2025 12:28 AM | Updated on Dec 19 2025 12:28 AM

Rupee rises 12 paise to close at 90.26 against U.S. dollar

డాలర్‌తో 12 పైసలు పటిష్టం 

90.26 స్థాయికి రికవరీ

న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి కాస్త బలపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం డాలర్‌తో 12 పైసలు పుంజుకుని 90.26కు కోలుకుంది. ఆర్‌బీఐ జోక్యంతో కుదుటపడింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర దిగిరావడమూ కలిసొచ్చింది. ఫారెక్స్‌ మార్కెట్లో 90.35 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 34 పైసలు పుంజుకుని 90.04 వరకు కోలుకుంది. చివరికి 12 పైసల లాభానికి పరిమితమైంది. 

రూపాయిపై ఆందోళన లేదు 
రూపాయి గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్‌ సన్యాల్‌ తెలిపారు. చైనా, జపాన్‌ సైతం అధిక వృద్ధి దశలో కరెన్సీ బలహీనతను ఎదుర్కొన్నట్టు చెప్పారు. రూపాయి బలహీనతను, ఆర్థిక ఆందోళనతో ముడిపెట్టరాదన్నారు. 1990ల నుంచీ రూపాయి తన వాస్తవ విలువకు అనుగుణంగా చలించేందుకే అనుమతించినట్టు.. అధిక ఆటుపోట్లను తగ్గించే క్రమంలోనే ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement