ఆర్‌బీఐ కార్యాలయాల ముందు క్యూ | People queue up at RBI offices to exchange Rs 2,000 notes | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ కార్యాలయాల ముందు క్యూ

Oct 14 2023 4:32 AM | Updated on Oct 14 2023 4:32 AM

People queue up at RBI offices to exchange Rs 2,000 notes - Sakshi

న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కార్యాలయాల ముందు జనం బారులు దీరారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్‌ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్‌ 7 వరకు అందించాయి. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేవలను దేశవ్యాప్తంగా 19 ఆర్‌బీఐ కార్యాలయాలు కొనసాగిస్తున్నాయి. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు 2023 మే 19న ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మార్పిడి, డిపాజిట్‌కు సెపె్టంబర్‌ 30 వరకు అనుమతించారు. ఆ తర్వాత ఆఖరు తేదీని అక్టోబర్‌ 7 వరకు పొడిగించారు. ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు.

బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. వ్యవస్థ నుంచి రూ.3.43 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గత శుక్రవారం వెల్లడించారు. రూ.12,000 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement