ఒలెక్ట్రాకు 100 ఈ–బస్‌ల ఆర్డర్‌

Olectra Greentech to supply 100 electric buses to Assam - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తాజాగా 100 ఈ–బస్‌లకు ఆర్డర్‌ అందుకుంది.  అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ స్వీకరించింది. డీల్‌ విలువ రూ.151 కోట్లు అని సంస్థ సీఎండీ కె.వి.ప్రదీప్‌ ఈ సందర్భంగా తెలిపారు.

కంపెనీ తయారీ ఎలక్ట్రిక్‌ బస్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్‌.  తొమ్మిది నెలల్లో ఈ బస్సులను డెలివరీ చేయనుంది. ఒలెక్ట్రాను మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రమోట్‌ చేస్తోంది. కాగా, గ్రీన్‌టెక్‌ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.800 కోట్ల వరకు నిధులను  సమీకరించడానికి బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఒలెక్ట్రా పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top