ముత్తూట్‌ ఫైనాన్స్‌ ‘మిల్లీగ్రామ్‌ గోల్డ్‌ ప్రోగ్రామ్‌’

Muthoot Finance to launch milligram reward programme - Sakshi

కొచ్చి: గోల్డ్‌ ఫైనాన్సింగ్‌ దిగ్గజం ముత్తూట్‌ ఫైనాన్స్‌ ‘మిల్లీగ్రామ్‌ గోల్డ్‌ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముత్తూట్‌ గ్రూప్‌ వద్ద లావాదేవీలను నిర్వహించే కస్టమర్లకు కనీసం మిల్లీగ్రామ్‌ బంగారం బహుమతిగా అందజేస్తుంది. రిఫరల్‌ లావాదేవీపై 20 మిల్లీగ్రాముల బంగారం పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ ఏప్రిల్‌ 2022 నుంచి నిర్వహించిన అన్ని లావాదేవీలపై వర్తిస్తుంది.

ఏటా రూ.50 కోట్ల విలువైన(100 కేజీలు) బంగారాన్ని కస్టమర్లకు అందించాలని కంపెనీ భావిస్తోంది. ‘రెండేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లతో మా అనుబంధం మరింత  బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాము. ఎన్నో ఏళ్లుగా వారు మాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞత ఇది’ అని కంపెనీ ఎండీ జార్జ్‌ అలెగ్జాండర్‌ ముత్తూట్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top