breaking news
gold gift
-
నగరం మీది ప్రేమతో... 21 కిలోల బంగారం విరాళం
టోక్యో: స్వాతంత్య్రోద్యమ సమయంలో, 1962లో చైనాతో యుద్ధం సమయంలో మన దేశంలో చాలామంది మహిళలు బంగారు ఆభరణాలను ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. అలాగే ఇప్పుడు జపాన్లోనూ ఓ అజ్ఞాత వ్యక్తి తను నివాసముంటున్న ఒసాకా నగరం మీద ప్రేమతో ఏకంగా 21 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేశాడు! వాటి విలువ ఏకంగా రూ.32 కోట్ల పై చిలుకు! నగరంలో పూర్తిగా పాతబడిపోయిన తాగునీటి, డ్రైనేజీ పైపుల వ్యవస్థను వాటి సాయంతో సమూలంగా పునరుద్ధరించాల్సిందిగా ఆయన కోరాడు. ఒసాకా మేయర్ హిదేయుకి యొకోయామా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఒసాకాలో 90 శాతానికి పైగా నీటి పైపులు లీకేజీలమయమే. దీనిపై నగర వాటర్వర్క్స్ బ్యూరో ఇప్పటికే పలుమార్లు ఆందోళన వెలిబుచ్చింది కూడా. వాటి పునరుద్ధరణకు భారీ నిధులు కావాలి. కానీ నగరానికి అంత బడ్జెట్ లేదు. ఈ సమయంలో అద్భుతం జరిగింది. అజ్ఞాత దాత ఒకరు గత నవంబర్లో ఏకంగా 21 కిలోల బంగారు కడ్డీలు విరాళమిచ్చారు. ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! పైపుల పునరుద్ధరణ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వాటిని సది్వనియోగం చేస్తాం’’అని ఆయన ప్రకటించారు. సదరు అజ్ఞాత దాత గతంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ కోసం లక్షల రూపాయల నగదు ఇచ్చారని తెలిపారు. సమస్యల నగరం 30 లక్షల జనాభా ఉన్న ఒకాసా జపాన్లో మూడో అతి పెద్ద నగరం. దేశ ఆర్థిక రాజధానిగా కూడా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు దేశ రాజధానిగానూ కొనసాగింది. అత్యంత పురాతన నగరం కూడా. ఇక్కడి మంచి నీరు, డ్రైనేజీ పైపులు కూడా అంతే పురాతనమైనవి. పైపులు పూర్తిగా తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. వాటి లీకేజీలు స్థానికుల భద్రతను నిత్యం ప్రమాదంలోకి నెడుతున్నాయి. వీటికి తోడు నగరంలో రోడ్లపై సింక్ హోల్స్ (భారీ గుంతలు) కూడా సర్వసాధారణంగా మారాయి. గతేడాది అలాంటి ఓ భారీ సింక్ హోల్ ఏకంగా ఒక క్యాబ్నే మింగేసింది. ఆ దుర్ఘటనలో దాని డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కానీ నిధుల లేమి కారణంగా మంచినీటి, డ్రైనేజీ పైపుల మారి్పడి వ్యవహారం ఓ పట్టాన ముందుకు సాగడం లేదు. -
జగ్గారెడ్డి బంగారం
-
ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’
కొచ్చి: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ వద్ద లావాదేవీలను నిర్వహించే కస్టమర్లకు కనీసం మిల్లీగ్రామ్ బంగారం బహుమతిగా అందజేస్తుంది. రిఫరల్ లావాదేవీపై 20 మిల్లీగ్రాముల బంగారం పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి నిర్వహించిన అన్ని లావాదేవీలపై వర్తిస్తుంది. ఏటా రూ.50 కోట్ల విలువైన(100 కేజీలు) బంగారాన్ని కస్టమర్లకు అందించాలని కంపెనీ భావిస్తోంది. ‘రెండేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లతో మా అనుబంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాము. ఎన్నో ఏళ్లుగా వారు మాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞత ఇది’ అని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ తెలిపారు. -
Viral: వధువుకు 60 కేజీల బంగారం బహుకరించిన వరుడు
వివాహ వేడుకలో పెళ్లి కూతురు బంగారు ఆభరణాలతో మెరిసిపొంది. కొన్ని సంపన్న కుటుంబాల్లో పెళ్లి కూతురుకు బంధువులు, అతిథులు బంగారాన్ని కూడా బహుకరిస్తారు. అయితే వివాహ వేడుకనలో వధువుకు కాబోయే భర్త భారీ బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. కాబోయే భర్త ఇచ్చిన భారీ బంగారు ఆభరణాలను వధువు ధరించడం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని హుబే ప్రావిన్స్లో ఓ వివాహ వేడుక జరిగింది. వివాహ మండపంలోనే కాబోయే భర్త వధువకు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. సెప్టెంబర్ 30న జరిగిన ఈ వివాహ వేడుకలో భారీ బంగారు ఆభరణాలు ధరించిన వధువును బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. ఒక్కోటి కిలో బరువున్న 60 బంగారు నెక్లెస్లను వరుడు ఆమెకు కానుకగా అందించాడు. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధరించి తన చేతిలో గులాబీలు పట్టుకుని ఒంటి నిండా నగలతో ఆమె అందంగా ముస్తాబైంది. వరుడు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వధువును బంగారు ఆభరణాల్లో ముంచెత్తాడు. భారీ బంగారు ఆభరణాలతో కనిపించే వధువు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
మావుళ్లమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట
భీమవరం (ప్రకాశం చౌక్) : పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ దర్శనం కోసం శుక్రవారం భక్తులు భారీగా తరిలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు చీరలు, జాకెట్ ముక్కలు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన గరిషే రవీందర్, మంజులా దంపతులు 60 గ్రాముల 800 మిల్లీ గ్రాముల (రాళ్ల, పూసలతో సహా )బంగారం హారం బహుకరించారు. ఆలయ ఈవో నల్ల సూర్యచక్రధరరావు దాతలను అభినందించారు. ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. అలాగే అమ్మవారిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శంచుకున్నారు.


