మైక్రోసాఫ్ట్‌ ఏఐ ఇన్నోవేట్‌ | Microsoft AI Innovate to empower AI start-ups in India | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌ ఏఐ ఇన్నోవేట్‌

Oct 21 2021 6:08 AM | Updated on Oct 21 2021 6:08 AM

Microsoft AI Innovate to empower AI start-ups in India - Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌  తాజాగా ఏఐ ఇన్నోవేట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆర్టీఫీషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో ఉన్న స్టార్టప్స్‌ కార్యకలాపాలను విస్తృతం చేయడం, ఆవిష్కరణలను నడిపించడంతోపాటు పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. నవంబర్‌లో ప్రారంభమై 10 వారాలపాటు ఇది సాగనుంది. ఏఐ రంగంలో స్టార్టప్స్‌ సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్‌ మూడవ స్థానంలో ఉందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఏఐ వినియోగం ద్వారా 2035 నాటికి భారత ఆర్దిక వ్యవస్థకు రూ.6,75,000 కోట్లకుపైగా తోడవుతుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement