Taxpayers With Income Marginally Over Rs 7 Lakh to Get Relief in New Tax Regime - Sakshi
Sakshi News home page

ట్యాక్స్‌పేయర్లకు కొంత ఊరట..

Published Sat, Mar 25 2023 12:14 AM

Individual Taxpayers With Income Marginally Over Rs 7 Lakh To Get Relief Under New Tax Regime - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయం రూ. 7 లక్షలకన్నా స్వల్పంగా ఎక్కువుండి, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి కొంత ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 7 లక్షల పరిమితిని దాటిన మొత్తానికి మాత్రమే పన్ను విధించేలా ఆర్థిక బిల్లును సవరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారం ఉండదు.

(ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్‌ జుకర్‌బర్గ్)

కానీ రూ. 7,00,100 ఉంటే మాత్రం రూ. 25,010 మేర పన్ను కట్టాల్సిరానుంది. అంటే రూ. 100 ఆదాయానికి రూ. 25,010 పన్ను భారం పడనుంది. ఈ నేపథ్యంలో పరిమితికన్నా ఆదాయం కాస్త ఎక్కువ ఉంటే, దానికి మించి పన్ను భారం ఉండరాదంటూ స్వల్ప ఊరటను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఎంత మేర అధిక ఆదాయానికి ఇది వర్తిస్తుందనేది ప్రభుత్వం నిర్దిష్టంగా వివరించలేదు. సుమారు రూ. 7,27,700 వరకు ఆదాయం ఉన్న వారికి దీనితో ప్రయోజనం ఉండగలదని నాంగియా ఆండర్సన్‌ పార్ట్‌నర్‌ సందీప్‌ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. (శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ , అదిరిపోయే లాంచింగ్‌ ఆఫర్‌ కూడా!)

విషాదం: ఇంటెల్‌ కో-ఫౌండర్‌, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత

Advertisement

తప్పక చదవండి

Advertisement