బంగారం దిగుమతులు డౌన్‌ | Gold imports dip 4. 23 percent to 12. 64 billion dollars in Apr-July | Sakshi
Sakshi News home page

బంగారం దిగుమతులు డౌన్‌

Aug 17 2024 4:54 AM | Updated on Aug 17 2024 11:55 AM

Gold imports dip 4. 23 percent to 12. 64 billion dollars in Apr-July

రూ.1.05 లక్షల కోట్ల విలువ 

ఏప్రిల్‌–జూలై మధ్య నమోదు  

న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి నాలుగు నెలల్లో.. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 12.64 బిలియన్‌ డాలర్ల (రూ.1.05 లక్షల కోట్లు సమారు) విలువైన బంగారం దిగుమలు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్‌–జూలై మధ్య దిగుమతులు 13.2 బిలియన్‌ డాలర్లతో పోలి్చనప్పుడు 4.23 శాతం తగ్గాయి.

 ఒక్కజూలై నెల వరకే చూస్తే పసిడి దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 జూలైలో 3.5 బిలియన్‌ డాలర్ల దిగుమతులు నమోదు కావడం గమనించొచ్చు. 

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులకు తోడు, అధిక ధరలే బంగారం దిగుమతులపై ప్రభావం చూపించినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. పండుగల సీజన్‌ నేపథ్యంలో సెపె్టంబర్‌ నుంచి దిగుమతులు పెరగొచ్చని, దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం సైతం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని ఓ జ్యుయలరీ వర్తకుడు అభిప్రాయపడ్డారు. 

బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి ఇటీవలి బడ్జెట్‌లో భాగంగా కేంద్రం తగ్గించడం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24) మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మన దేశానికి దిగుమతి అవుతున్న బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్‌ నుంచి వస్తుంటే, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. మన దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతంగా ఉంది.  

గణనీయంగా వెండి దిగుమతులు 
ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య మన దేశం నుంచి 9.1 బిలియన్‌ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 7.45 శాతం తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 648 మిలియన్‌ డాలర్ల విలువైన వెండి దిగుమతులు జరిగాయి.

 క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 215 బిలియన్‌ డాలర్లతో పోల్చి చూసినప్పుడు రెండు రెట్లు పెరిగాయి. యూఏఈతో 2022 మే 1 నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచి్చంది. దీంతో ఆ దేశం నుంచి బంగారం, వెండి దిగుమతులు పెరిగిపోయాయి. దీనిపై పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండంతో కొన్ని నిబంధనలను సమీక్షించాలని భారత్‌ కోరుతోంది.  

పెరిగిన వాణిజ్య లోటు 
ఏప్రిల్‌ నుంచి జూలై వరకు దేశ వాణిజ్య లోటు 85.58 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఒక్క జూలై నెలకే 23.5 బిలియన్‌ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదైంది. చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్‌ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా జ్యుయలరీ పరిశ్రమ నుంచి బంగారానికి ఎక్కువ డిమాండ్‌ ఉంటోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement