పసిడి ఆనందం ఆవిరి.. భారీగా పెరిగిన ధరలు | Gold and Silver Price Today 31 July 2024 | Sakshi
Sakshi News home page

పసిడి ఆనందం ఆవిరి.. భారీగా పెరిగిన ధరలు

Jul 31 2024 2:54 PM | Updated on Jul 31 2024 3:06 PM

Gold and Silver Price Today 31 July 2024

దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (జూలై 31) ఒక్కసారిగా ఎగిశాయి. చాలా రోజుల తర్వాత భారీ స్థాయిలో రేట్లు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశకు గురయ్యారు.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) రూ.800 పెరిగి రూ.64,000 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే రూ.870 ఎగసి రూ. 69,820ని తాకింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.800 పుంజుకుని రూ.64,150 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 870 పెరిగి రూ.69,970 లకు ఎగిసింది. ఇక చెన్నై విషయానికి వస్తే  22 క్యారెట్ల బంగారం స్వల్పంగా రూ.350 పెరిగి రూ.64,200 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.390 పుంజుకుని రూ.70,040 వద్దకు చేరింది.

వెండి ధరలూ భారీగానే..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీగానే పెరిగాయి. హైదరాబాద్‌లో నేడు వెండి రేటు కేజీకి రూ.2000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.91,000 వద్దకు చేరింది. క్రితం రోజున ఇది రూ.89,000లుగా ఉండేది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement