ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్‌ పింఛను | EPS beneficiaries can access pension from branches of all banks | Sakshi
Sakshi News home page

ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్‌ పింఛను

Sep 5 2024 5:05 AM | Updated on Sep 5 2024 8:25 AM

EPS beneficiaries can access pension from branches of all banks

2025 జనవరి నుంచి అమలు ∙కార్మిక శాఖ మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌’ (ఈపీఎస్‌) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. 

ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌’కు కారి్మక శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్‌ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్‌)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్‌ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆధునికీకరణలో సీపీపీఎస్‌ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు.

Advertisement
 
Advertisement
Advertisement