ముంబై: భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 60 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని బ్రిటన్ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– బార్క్లేస్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత 45 బిలియన్ డాలర్ల అంచనాలను ఎగువముఖంగా సవరించింది. బార్క్లేస్ తాజా అంచనాలు నిజమైతే, క్యాడ్ పరిమాణం 2021–22 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 2 శాతంగా ఉంటుంది.
కరెంట్ అకౌంట్ అంటే...
ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించేదే కరెంట్ అకౌంట్. వచ్చినదానికన్నా ఇతర దేశాలకు చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్ అకౌంట్ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్ అకౌంట్ మిగులు.
2020–21లో మిగులే
కరోనా సవాళ్లు, దిగుమతులు భారీగా పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే (2020 ఏప్రిల్–2021 మార్చి) కరెంట్ అకౌంట్ మిగుల్లోనే ఉంది. విలువలో 102.2 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.9 శాతం) నమోదయ్యింది. 2021–22 మొదటి త్రైమాసికంలోనూ తిరిగి మిగులును నమోదుచేయడం గమనార్హం. 2021–22 క్యూ1 (ఏప్రిల్–జూన్)లో కరెంట్ అకౌంట్ 6.5 బిలియన్ డాలర్ల మిగులు (జీడీపీలో 0.9 శాతం) ఉంది. 2021–22 మొత్తంగా కూడా కరెంట్ అకౌంట్ మిగులే నమోదవుతుందని తొలుత అంచనాలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి గణనీయంగా మారుతూ వచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు, బొగ్గు, మెటల్ వంటి కీలక దిగుమతి ఉత్పత్తుల ధరలు తీవ్రంకావడం వల్ల కరెంట్ అకౌంట్ను లోటు దిశగా నడిపిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మారకద్రవ్య నిల్వల బలం
కాగా భారత్ వద్ద ఉన్న 600 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయంగా ఒడిదుడుకుల నుంచి దేశ ప్రయోజనాలు కాపాడ్డానికి దోహదపడతాయని అంచనా. దాదాపు 15 నెలల దిగుమతులకు సరిపడా నిల్వలు భారత్ వద్ద ఉండడం గమనార్హం. 2013లో జీడీపీలో 15 శాతం ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఇప్పుడు ఈ నిష్పత్తి దాదాపు 22 శాతానికి పెరిగింది.
60 బిలియన్ డాలర్లకు క్యాడ్ లోటు
Published Fri, Dec 3 2021 9:12 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement