చేనేత వృత్తిలో ఉన్నవారికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకంతో ఆర్థిక ఉపశమనం కలిగించింది. కరోనా సమయంలో కూడా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేతలపై శీతకన్ను వేసింది. ముడిపట్టు ధరలు పెరిగిపోయాయి. పాలకులు స్పందించకపోతే అందమైన చేనేత సంప్రదాయం కనుమరుగవుతుంది.
– శీలం రమేష్, వైఎస్సార్సీపీ చేనేత విభాగం అధ్యక్షులు
పథకంపై స్పష్టత లేదు
నేతన్న భరోసా పథకంపై స్పష్టత లేదు. చేనేత కార్మికుల నుంచి ఆయా సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. వీరిలో ఎంతమంది అర్హత ఉందో,అనర్హులు ఎవరో చెప్పలేదు. చేనేత దినోత్సవం రోజు లబ్దిదారులకు సొమ్ము అందిస్తారనేది నమ్మకం లేదు.
– సుధాకర్, చేనేత సమాఖ్య అధ్యక్షుడు


