రాయచోటికి చెందిన నేను మెగా డీఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్(బయలాజికల్ సైన్న్స్, ఉర్దూమీడియం) పరీక్ష రాశాను. స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్న్స్ విభాగంలో రెండు పోస్టులు ఉండగా, రెండో పోస్టు ఈడబ్ల్యూఎస్కు రిజర్వ్ చేశారు. ఆ పోస్టుకు నేను అర్హుడిని. అయితే, నాకు ఇవ్వాల్సిన పోస్టును బీసీ–ఈ కేటగిరీకి చెందిన వనం మునవ్వర్ రసూల్కు ఇచ్చారు. ముస్లిం బీసీ షేక్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్కు అనర్హుడు. ఇతను గత నాలుగు డీఎస్సీల్లో తనను బీసీగా నమోదుచేసుకుని పరీక్షలకు హాజరయ్యాడు. 2025 డీఎస్సీలో తప్పుడు కులఽధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొంది మడితాడు జెడ్పీ ఉర్దూ ఉన్నతపాఠశాలలో పనిచేస్తున్నాడు. ఈ అక్రమ నియామకంపై అన్ని ఆధారాలతో గ్రీవెన్సెల్కు, ప్రజాప్రతినిధులు, మంత్రుల దృష్టికి తెచ్చినా స్పందన లేదు. మునవర్ రసూల్ సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్తో రద్దు చేయించుకుని రా..అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. నాకు న్యాయం చేయాలి. – సయ్యద్ జమీల్, డీఎస్సీ అభ్యర్థి, రాయచోటి


