
మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు.
సాక్షి, తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
‘‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు. ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

“దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని, సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2024
ఇదీ చదవండి: