స్వామి వివేకానంద వ‌ర్ధంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Paid Tributes To Swami Vivekananda On His Death Anniversary, Check Out Post Inside | Sakshi
Sakshi News home page

స్వామి వివేకానంద వ‌ర్ధంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి

Jul 4 2026 9:12 AM | Updated on Jul 4 2026 10:04 AM

YS Jagan paid tributes to Swami Vivekananda Death anniversary

సాక్షి, తాడేపల్లి: నేడు స్వామి వివేకానంద వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. నివాళులు అర్పించారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘మీపై మీకు విశ్వాసం ఉంటేనే గొప్ప విజయాలకు పునాది పడుతుందన్న దార్శనికుడు స్వామి వివేకానంద. భారత యువతలో ఆత్మవిశ్వాసం. సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మ‌హ‌నీయుడు స్వామి వివేకానంద. ప్రతీ యువకుడు తన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ.. జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా.. దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని.. ఆయ‌న ఇచ్చిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయ‌కం. నేడు స్వామి వివేకానంద వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement