సాక్షి, తాడేపల్లి: నేడు స్వామి వివేకానంద వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మీపై మీకు విశ్వాసం ఉంటేనే గొప్ప విజయాలకు పునాది పడుతుందన్న దార్శనికుడు స్వామి వివేకానంద. భారత యువతలో ఆత్మవిశ్వాసం. సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మహనీయుడు స్వామి వివేకానంద. ప్రతీ యువకుడు తన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ.. జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా.. దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని.. ఆయన ఇచ్చిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
`మీపై మీకు విశ్వాసం ఉంటేనే గొప్ప విజయాలకు పునాది పడుతుంది.`
* స్వామి వివేకానంద
భారత యువతలో ఆత్మవిశ్వాసం, సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మహనీయుడు స్వామి వివేకానంద గారు. ప్రతి యువకుడు తన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ, జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా, దేశాభివృద్ధిని లక్ష్యంగా… pic.twitter.com/iIpFWBYIft— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2026


