సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రెస్మీట్ జరగనుంది.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజా సమస్యలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.


