బ్రహ్మనాయుడు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ భరోసా | YS Jagan Mohan Reddy Call To Bolla Brahmanayudu Son Giribabu | Sakshi
Sakshi News home page

బ్రహ్మనాయుడు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ భరోసా

Jun 8 2026 4:15 AM | Updated on Jun 8 2026 4:15 AM

YS Jagan Mohan Reddy Call To Bolla Brahmanayudu Son Giribabu

బొల్లా గిరిబాబుతో ఫోన్‌లో మాట్లాడిన మాజీ సీఎం

సాక్షి,అమరావతి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి వైఎ­స్సార్‌సీపీ అండగా నిలబడుతుందని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బ్రహ్మ­నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ ఆదివారం బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా గిరిబాబుతో ఫోన్‌లో మా­ట్లాడి ధైర్యం చెప్పారు.

పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన న్యా­య సహాయాన్ని పార్టీ లీగల్‌ సెల్‌ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ఆరోప­ణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయ­పడాల్సిన అవసరం లేదని, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని భరోసా కల్పించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement