నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ | YSRCP Chief YS Jagan Meeting With Local Body Representatives Today In Tadepalli, Check Top News Headlines Inside | Sakshi
Sakshi News home page

నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

Apr 24 2025 5:35 AM | Updated on Apr 24 2025 10:34 AM

YS Jagan to meet with local body representatives today

సాక్షి, అమరావతి: వైఎ­స్సార్‌ జిల్లా ప్రొద్దు­టూ­రు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపా­లిటీ­లు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా­ప్రతి­నిధులతో వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) గురువారం సమావేశం కానున్నారు. 

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వా­నించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement