పాల్గొననున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 6 గంటలకు హాజరవుతారు.
ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.


