లంక సిస్టర్స్‌.. ఇద్దరూ డాక్టర్స్‌..!  | West Godavari: Sisters From Same Family Have Best Ranks In NEET | Sakshi
Sakshi News home page

లంక సిస్టర్స్‌.. ఇద్దరూ డాక్టర్స్‌..! 

Oct 10 2022 7:35 PM | Updated on Oct 11 2022 7:23 AM

West Godavari: Sisters From Same Family Have Best Ranks In NEET - Sakshi

ఐశ్వర్య-సాయి తేజస్వి

ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి డాక్టర్లుగా అవకాశం రావడంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

పెనుగొండ(పశ్చిమగోదావరి): ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన గొర్రె వెంకటేశ్వరరావు కుమార్తెలు సాయి తేజస్వి, ఐశ్వర్య ఈ ఘనత సాధించారు. ఇప్పటికే బీడీఎస్‌ పూర్తిచేసిన సాయితేజస్వి, నీట్‌ (ఎండీఎస్‌)లో జాతీయస్థాయిలో 1048 ర్యాంకు సాధించింది.
చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?

అక్క స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఈ ఏడాది నీట్‌లో జాతీయస్థాయిలో 7395 ర్యాంకు సాధించింది. వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి డాక్టర్లుగా అవకాశం రావడంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement